104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు


పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి

గుంటూరు జిల్లా : కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. రూ.3.30 లక్షల విలువ చేసే నగదు ప్రోత్సాహకాలు మంత్రి చేతుల మీదుగా ఇవ్వ‌డం ప‌ట్ల విద్యార్థులు ఆనందం వ్య‌క్తం చేశారు.. టెన్త్ తో పాటు సెకండ్ ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ ప్రోత్సాహకాలు అందజేశారు. టెన్త్, సెకండ్ ఇంటర్ లో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గంలో మొదటి అయిదు స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన 20 మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులకు రూ.3 వేల చొప్పున రూ.30 వేలు ఇచ్చారు.

తృతీయ స్థానంలో నిలిచిన 20 మంది విద్యార్థులకు రూ.2 వేలు చొప్పున రూ.40 వేలు అందజేశారు. మరో 120 మంది విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.లక్షా 20 వేలు ప్రోత్సాహక నగదు రూపంలో అందజేశారు .అత్యుమ్మ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సొంతంగా రూ.లక్ష నగదు, 200 స్కూల్ బ్యాగ్ లను మంత్రి సవిత అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ లో, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన నలుగురు విద్యార్థులకు రూ.25 వేల చొప్పున రూ.లక్ష లను మంత్రి సవిత తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *