ఏఎస్పీ భుజంగ‌రావు ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క నిందితుడు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే ప‌లువురు ఉన్న‌తాధికారుల‌కు ప్ర‌మేయం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ద‌ర్యాప్తు చేసేందుకు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ లో కీల‌కమైన వ్య‌క్తిగా భావిస్తున్న అద‌న‌పు ఎస్పీ అధికారి హోదాలో ప‌ని చేసిన భుజంగ‌రావు ఇళ్ల‌లో బుధ‌వారం అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేప‌ట్టారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు ను గతంలోనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఆయన నివాసాలు.. బంధువు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏసీబీ దాడుల‌కు దిగ‌డం పోలీసు శాఖ‌లో క‌ల‌క‌లం రేపుతోంది. అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఎప్పటినుండో ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏసీబీ సోదాలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఆయనకు చెందిన పదిహేను చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *