రూ. 18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబడి
చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరిన టీవీకే కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులకే భారీ పెట్టుబడిని ఆకర్షించింది సర్కార్. తాజాగా లార్సెన్ టూబ్రో (L,T) సంస్థ, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమక్షంలో సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దీని ద్వారా తమిళనాడు ₹18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబడి హామీని దక్కించుకుంది.
కాంచీపురం, కోయంబత్తూరు, తిరువళ్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రతిపాదిత పెట్టుబడులు, 8,200 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులలో కాంచీపురంలో ₹15,000 కోట్ల విలువైన డేటా సెంటర్ విస్తరణ, కోయంబత్తూరులో ₹2,500 కోట్ల ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం , తిరువళ్లూరులోని L&T నౌకా నిర్మాణ కేంద్రం (shipbuilding yard) కు సంబంధించి ₹1,100 కోట్ల విస్తరణ పనులు ఉన్నాయి.
2036 నాటికి తమిళనాడును $1.5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం దిశగా ఈ పెట్టుబడి ప్యాకేజీ ఒక కీలక అడుగుగా పరిగణిం చబడుతోంది; అంతేకాకుండా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నాయకత్వంలో కుదిరిన మొట్టమొదటి భారీ పారిశ్రామిక అవగాహన ఒప్పందంగా ఇది నిలుస్తుంది.








