23.20 బిలియ‌న్ల‌కు చేరుకున్న డిజిట‌ల్ చెల్లింపులు

రూ. 30 ల‌క్ష‌ల కోట్ల మార్క్ కు చేరుకున్న వైనం

ముంబై : యూపీఐ డిజిటల్ చెల్లింపుల జోరు కొన‌సాగుతోంది. ఏకంగా గ‌త మే నెలలో లావాదేవీల పరిమాణం 23.20 బిలియన్లకు చేరుకుంది. వీటి ట్రాన్సాక్ష‌న్ విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మే 2026లో 23.20 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. వీటి మొత్తం లావాదేవీల విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇది దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల నిరంతర వృద్ధిని ప్రతిబింబిస్తోంది.

పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం, వ్యాపారుల విస్తృత ఆమోదం, విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాల కారణంగా, యూపీఐ భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఇదిలా ఉండ‌గా కోట్లాది మంది ప్ర‌తి రోజూ త‌మ రోజూ వారీ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి లావాదేవీలు కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు బ్యాంకింగ్ రంగ వ్య‌వ‌స్థ కంటే ఈ డిజిట‌ల్ చెల్లింపులపై దృష్టి సారించారు ఖాతాల వినియోగ‌దారులు. ఈ విష‌యాన్ని ఇవాళ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

  • Related Posts

    సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్

    కర్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమల్లో సిమెంట్ రంగం అత్యంత సవాలుతో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ సంస్థగా మారాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన…

    బ్యాంకుల ఎస్ఎంఎస్ ఛార్జీలపై ఆర్‌బిఐ ఉక్కుపాదం

    ముంబై : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. SMS అలర్ట్‌లకు కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. నిబంధనల పాటింపు, అవగాహన, లేదా ప్రచార ప్రయోజనాల కోసం ఈ నిర్ణ‌యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *