రూ. 30 లక్షల కోట్ల మార్క్ కు చేరుకున్న వైనం
ముంబై : యూపీఐ డిజిటల్ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. ఏకంగా గత మే నెలలో లావాదేవీల పరిమాణం 23.20 బిలియన్లకు చేరుకుంది. వీటి ట్రాన్సాక్షన్ విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మే 2026లో 23.20 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. వీటి మొత్తం లావాదేవీల విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇది దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల నిరంతర వృద్ధిని ప్రతిబింబిస్తోంది.
పెరుగుతున్న స్మార్ట్ఫోన్ వినియోగం, వ్యాపారుల విస్తృత ఆమోదం, విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాల కారణంగా, యూపీఐ భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఇదిలా ఉండగా కోట్లాది మంది ప్రతి రోజూ తమ రోజూ వారీ వ్యవహారాలకు సంబంధించి లావాదేవీలు కొనసాగుతూ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు బ్యాంకింగ్ రంగ వ్యవస్థ కంటే ఈ డిజిటల్ చెల్లింపులపై దృష్టి సారించారు ఖాతాల వినియోగదారులు. ఈ విషయాన్ని ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ) కీలక ప్రకటన చేసింది.







