యువ నటుల కెరీర్ లను నాశనం చేస్తుంది
హైదరాబాద్ : బుచ్చిబాబు దర్శకత్వం వహించిన పెద్ది మూవీ విడుదలైంది. ఇందులో రామ్ చరణ్ , జాహ్నవి కపూర్ , జగపతి బాబు, శివ రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ నేపథ్యంగా దీనిని తెరకెక్కించాడు. అయితే తొలి పార్ట్ మూవీ బాగున్నా రెండో పార్టులో తేలి పోయిందన్న విమర్శలు వచ్చాయి. దీని కారణంగా పెద్ద ఎత్తున కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించిందని సమాచారం. రోజు రోజుకు సోషల్ మీడియా వేదికగా పెద్దిపై నెగిటివ్ టాక్ పెరిగింది. దీనిపై నిర్మాత సంజయ్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు.
నటి జాన్వీ కపూర్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆమెను శృంగార పరంగా అతిగా చూపిస్తున్నాయన్న ఆరోపణలతో ‘పెద్ది’ చిత్రంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో గుప్తా ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’ చిత్రంపై ఆన్లైన్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై స్పందించారు. కెరీర్ పరిఢవిల్లే అవకాశాన్ని దక్కించు కోక ముందే సోషల్ మీడియా దానిని నాశనం చేయగలదని నొక్కి చెప్పారు గుప్తా. కొత్తగా పరిశ్రమలోకి వస్తున్న నటులు అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







