యూసుఫ్ ప‌ఠాన్ పై మ‌హువా మోయిత్రా ఫైర్

Spread the love

టీఎంసీపై గెలిచి అమిత్ షాను క‌లిస్తే ఎలా

కోల్ క‌తా : టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. భార‌త మాజీ క్రికెట‌ర్, టీఎంసీ ఎంపీగా ఉన్న యూసుఫ్ ప‌ఠాన్ ను ఏకి పారేశారు. మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయ నాయకురాలు అయిన మహువా మోయిత్రా యూసుఫ్ పఠాన్‌ను మందలిస్తూ ట్వీట్ చేశారు. యూసుఫ్ పఠాన్, అమిత్ షా పిలిచారని మీరు ఢిల్లీకి హడావిడిగా వెళ్తున్నారు. మీరు దేశం కోసం క్రికెట్ ఆడారు, బెంగాల్ ప్రజలు మిమ్మల్ని ఎంపీని చేయడానికి ఓటు వేశారు. కనీసం కొంచెం సిగ్గు అయినా ఉండి, వెన్నెముకను దృఢంగా ఉంచుకోండి అంటూ నిప్పులు చెరిగారు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ మధ్య కాలంలో యూసుఫ్ పఠాన్ విభిన్నంగా కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ యూసుఫ్ పఠాన్‌ను బెంగాల్‌కు పిలిపించి బహరంపూర్ స్థానంలో అధిర్ రంజన్ చౌదరిపై పోటీ చేయించి ఎంపీని చేశారని , ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని నిల‌దీశారు ఎంపీ మ‌హూవా మోయిత్రా. ఇప్పుడు అదే యూసుఫ్ పఠాన్ గుజరాత్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు, మహువా మోయిత్రా అదే కారణంతో సోషల్ మీడియాలో ఈ వ్యక్తిని తీవ్రంగా విమర్శించారు.

  • Related Posts

    విశాఖ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ దిగ్భ్రాంతి రేపు ప‌రామ‌ర్శ‌

    Spread the love

    Spread the loveక్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలి తాడేప‌ల్లి గూడెం : విశాఖ స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బుధ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తారు. ప్రమాద…

    రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

    Spread the love

    Spread the love10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న సీఎం అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *