బాంబు పేల్చిన బీజేపీ మంత్రి కైలాష్

మీ వాళ్లే మీనాక్షిపై స‌మాచారం ఇచ్చారు

భోపాల్ : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో లోపాలు ఉన్నాయన్న సమాచారం తెలంగాణ నుంచే వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ వర్గీయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సూచిస్తోంది. కైలాష్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానిక చెందిన కొంద‌రు నేత‌లు మీనాక్షికి సంబంధించి న‌మోదైన కేసు గురించి తెలియ చేశార‌ని, దీంతో ఇదే విష‌యాన్ని తాము ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామ‌ని చెప్పారు.

దీంతో ఎన్నిక‌ల అధికారి మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో త‌న నామినేష‌న్ ను తిర‌స్క‌రించ‌డం జ‌రిగింద‌న్నారు. అంత‌ర్గ‌త శ‌త్రువులు త‌మ పార్టీలో లేర‌ని అన్నారు మంత్రి కైలాష్ విజ‌య వ‌ర్గీయ‌. కాంగ్రెస్ పార్టీకి బ‌యట శ‌త్రువులు అంటూ ఎవ‌రూ లేర‌ని కానీ ఆ పార్టీలోనే ఉన్నార‌ని ఈ విష‌యం తేలి పోయింద‌న్నారు కైలాష్ విజ‌య వ‌ర్గీయ‌. అయితే ఆ స‌మాచారాన్ని కాంగ్రెస్ వారి నుంచే అంది ఉంటుంద‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *