మీ వాళ్లే మీనాక్షిపై సమాచారం ఇచ్చారు
భోపాల్ : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో లోపాలు ఉన్నాయన్న సమాచారం తెలంగాణ నుంచే వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సూచిస్తోంది. కైలాష్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానిక చెందిన కొందరు నేతలు మీనాక్షికి సంబంధించి నమోదైన కేసు గురించి తెలియ చేశారని, దీంతో ఇదే విషయాన్ని తాము ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని చెప్పారు.
దీంతో ఎన్నికల అధికారి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ ను తిరస్కరించడం జరిగిందన్నారు. అంతర్గత శత్రువులు తమ పార్టీలో లేరని అన్నారు మంత్రి కైలాష్ విజయ వర్గీయ. కాంగ్రెస్ పార్టీకి బయట శత్రువులు అంటూ ఎవరూ లేరని కానీ ఆ పార్టీలోనే ఉన్నారని ఈ విషయం తేలి పోయిందన్నారు కైలాష్ విజయ వర్గీయ. అయితే ఆ సమాచారాన్ని కాంగ్రెస్ వారి నుంచే అంది ఉంటుందని పేర్కొన్నారు.






