నిర్మాణంలో చారిత్రాత్మకం
హైదరాబాద్ , కాశ్మీర్ : ప్రపంచంలో జోజిలా టన్నెల్ నిర్దేశిత సమయంలోనే నిర్మాణం పూర్తయిందని ,ఇ ది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. భారతదేశ మౌలిక సదుపాయాల చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక రోజు. జోజిలా టన్నెల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ రికార్డు సృష్టించనుంది. ఇది లడఖ్ , జమ్మూ , కాశ్మీర్ ప్రజలకు జీవనాధార మార్గంగా నిలుస్తుంది.మైనస్ డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే తీవ్ర చలిలోనూ కార్మికులు, ఇంజినీర్లు , నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ బ్రేక్థ్రూను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బందిలో 80 శాతం మంది స్థానికులే.ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలతో నిర్మితమైన ఈ అత్యాధునిక టన్నెల్, గతంలో ఆరు నెలలపాటు రవాణా నిలిచిపోయే పరిస్థితులకు ముగింపు పలికి లడఖ్, కాశ్మీర్ కు మధ్య అన్ని కాలాల్లోనూ రహదారి అనుసంధానం అందిస్తుంది అని అన్నారు.
ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా భారతదేశ సాంకేతిక నైపుణ్యం, ఇంజినీరింగ్ సామర్థ్యం ప్రపంచానికి మరోసారి చాటబడింది. ఎం ఈ ఐ ఎల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి. కృష్ణారెడ్డి, హర్పాల్ సింగ్, కార్మికులు, ఇంజినీర్లు రాత్రింబవళ్లు కష్టపడి ఈ విజయాన్ని సాధించారు. త్వరలోనే జమ్మూ , కాశ్మీర్, లడఖ్ ప్రజలు దీని ప్రయోజనాలను అనుభవించనున్నారు అని చెప్పారు. జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ లడఖ్ మరియు జమ్మూ & కాశ్మీర్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల నేడు నిజమైంది. ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం, ఈ టన్నెల్ వారి జీవితాల్లో ఎంతటి సానుకూల మార్పును తీసుకు రానుందో తెలియజేస్తోంది. మెరుగైన రవాణా, కొత్త అవకాశాలు, పర్యాటక అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతంలో నిజమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు బ్రేక్థ్రూ పూర్తయినందున మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తవుతాయని ఆశిస్తున్నాను అని అన్నారు.





