సీఎం టూర్ సంద‌ర్బంగా 13న స‌మీక్ష స‌మావేశం

మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి వెల్ల‌డి

న‌ల్ల‌గొండ జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 17న న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇందుకు సంబంధించి భారీ స‌భ నిర్వ‌హిస్తున్నామ‌ని, స‌భ‌ను స‌క్సెస్ చేసేందుకు గాను జూన్ 13న స‌మీక్ష స‌మావేశం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా దర్వేష్‌పురం ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం నల్గొండలో తెలంగాణలోనే గత రెండున్నరేళ్లలో ఇదే అతిపెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.

₹13,000 కోట్ల రోడ్డు అభివృద్ధి పనులతో తెలంగాణ ముఖచిత్రం మారి పోతుందని, రహదారి ప్రమాదాలు గణనీయంగా తగ్గడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు 24 గంటల పాటు కృష్ణా జలాలను అందించేందుకు ₹125 కోట్లతో కొత్త వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. దీనికి కూడా ముఖ్యమంత్రి పర్యటన రోజునే వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *