ఐటీ కారిడార్‌లో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్

సమాచారం అందగానే పరారైన నీతూ భాయ్

హైద‌రాబాద్ : ఐటీ కారిడార్ లో భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది ఈగిల్ ఫోర్స్ . ఈమేర‌కు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంది. డ్రగ్ డాన్ ‘నీతూ భాయ్’ కోసం నానక్‌రామ్‌గూడలో ముమ్మర గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా ఈగిల్ ఫోర్స్ రాకపై సమాచారం అందగానే పరారయ్యాడు నీతూ భాయ్. కిరాణా దుకాణం వెనుక నుంచి గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గంజాయి కొనుగోలుకు నీతూ భాయ్ ఇంటికి వచ్చిన 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది ఈగిల్ ఫోర్స్

గతంలో పీడీ (PD) చట్టం కింద అరెస్టై జైలు నుంచి విడుదలైన నీతూ భాయ్ తిరిగి గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించినట్లు సమాచారం అందుకుంది. రోజుకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారుల అనుమానం. అంటే దాదాపు కోటిన్న‌ర‌కు పైగానే దీని ద్వారా సంపాదిస్తున‌న్న‌ట్లు అంచ‌నా వేసింది. నీతూ బాయ్ ఎక్క‌డికి పారి పోయాడ‌నే దానిపై ఈగిల్స్ టీం సెర్చ్ ప్రారంభించింది. త‌న‌కు ఎక్క‌డి నుంచి గంజాయి పెద్ద మొత్తంలో అందుతోంద‌నే దానిపై విచార‌ణ చేప‌ట్టింది టీం.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *