గత బీఆర్ఎస్ హయాంలో ఆర్ అండ్ చీఫ్ ఇంజనీర్
హైదరాబాద్ : ఏసీబీ భారీ తిమింగలాన్ని వల పన్ని పట్టుకుంది. ఆర్ అండ్ బిలో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేస్తున్న మోహన్ నాయక్ ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. మోసపూరిత టెండర్ల ద్వారా కోట్లు పోగు చేశాడు. తెలంగాణ ఆర్&బి చీఫ్ జె. మోహన్ నాయక్, అవినీతి కాంట్రాక్టర్ల లంచాలతో సమకూర్చిన బంగారు బిస్కెట్లు, నగదు, విలాసవంతమైన విల్లాల సిగ్గుచేటైన నిల్వలను ఏసీబీ దాడులు బయటపెట్టడంతో పతనం అంచున నిలిచారు. ఇదిలా ఉండగా తను మాజీ మంత్రి కేటీఆర్ కు అభిమానిగా ఉన్నారు. ఇది సంచలనంగా మారింది.
ఈ ఆర్ అండ్ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో భారీ ఎత్తున నగదు, ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, ఆస్తులు, ఫ్లాట్స్ , ప్లాట్లు, భూములకు సంబంధించిన లావాదేవీలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్లో 7 ఫ్లాట్లు, మియాపూర్లో ఒక విలాసవంతమైన ట్రిప్లెక్స్ విల్లా, కూకట్పల్లిలో మరో కొత్త ఇల్లు , 19.38 ఎకరాల వ్యవసాయ భూమి (5 ప్లాట్లు), మరో విల్లా కోసం చెల్లించిన ₹1 కోటి అడ్వాన్స్ తో పాటు ₹55 లక్షల నగదు, దాదాపు ₹2 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో ₹1.44 కోట్లు, ₹1.26 కోట్ల విలువైన విలాసవంతమైన గృహోపకరణాలు, 9 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లు , 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.





