బీజేపీ ఆడిన నాటకాన్ని తప్పు పట్టిన కాంగ్రెస్ అగ్ర నేత
హైదరాబాద్ : మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నటరాజన్ తెలంగాణలో మా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆమె ఎంతో నిజాయితీ గల, అంకితభావం కలిగిన మహిళా నాయకురాలు. మధ్యప్రదేశ్ నుండి ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం అన్యాయం. నాకు తెలిసినంత వరకు మీనాక్షి నటరాజన్ ఏ విధమైన నిరసనలు, రాస్తారోకోలు లేదా రాజకీయ కేసుల్లోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. ఆమెపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు, అలాగే కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా ఏ కేసులూ పెండింగ్లో లేవు. ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా చట్టపరమైన చర్యలకు దారితీసే అంశాలేవీ లేవు.
అయినప్పటికీ మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించేలా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక రకంగా, ఎన్నికల సంఘాన్ని ముందుంచి వారు తమ ప్రయత్నంలో విజయం సాధించారు. ఇంతటి నీచమైన రాజకీయాలకు దిగజారాల్సిన అవసరం ఏముంది? నటరాజన్ రాజ్యసభ సీటును దక్కించు కోకుండా అడ్డుకోవడం ప్రధానమంత్రి కార్యాలయానికి, ఎన్నికల సంఘానికి, మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి అంత ముఖ్యమైన విషయమా? దీని వెనుక ఉన్న అత్యవసర పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.





