ఏపీలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయాలి

Spread the love


దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ఈనెల 21న యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వహించాల‌ని ఆయ‌న ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. యోగాంధ్ర నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌పై సచివాల‌యంలో కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర నిర్వహణకు తీసుకున్న చర్యలు, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొంటాన‌ని చె్ప్పారు సీఎం.

21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్టేట్ ఈవెంట్‌ నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ ను, ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు. స్టేడియంలో 5 వేల నుంచి 6 వేల మందితో యోగా కార్యక్రమం ఉంటుంద‌న్నారు. బాబా రాందేవ్ సహా ప‌లువురు యోగా ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే యోగాంధ్రకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని స్ప‌ష్టం చేశారు. ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా…. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

  • Related Posts

    డొనాల్డ్ ట్రంప్ తో ప్ర‌ధాని మోదీ భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క అంశాల‌పై విస్తృత చ‌ర్చ‌లు ఫ్రాన్స్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు భార‌త దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న జి 7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌ధాన‌మంత్రులు,…

    కృష్ణలంక సీఐపై విచార‌ణ‌కు ఆదేశం

    Spread the love

    Spread the loveఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు రౌడీషీట‌ర్ లాక‌ప్ డెత్ పై స్పందించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *