మేం చిల్లర రాజకీయాలు చేయాలని అనుకోం
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్ స్వామి , చోక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో ఇప్పుడు నేను, శ్రీధర్ బాబు , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అలాంటి రాజకీయాలు చేస్తున్నాం అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఆదర్శంగా ఉన్నాం అన్నారు. విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చామని తెలిపారు. తాము పెరిగిన దానిపై మీ అందరూ సాక్ష్యంగా ఉన్నారన్నారు. సంక్షేమ శాఖల్లో మొత్తం సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ టెండర్లు 2000 కోట్లు కానప్పుడు 2 వేల కోట్ల స్కాం జరిగిందని ఎలా అంటారని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్.
మీరు ఇలా మాట్లాడితే మీ గౌరవం మీ ఆలోచన విధానం ప్రజలకు తెలుస్తుందన్నారు. బలహీన వర్గాల మంత్రి గా నేను దళిత వర్గాల మంత్రి గా అడ్లూరి ,మైనార్టీ మంత్రి గా అవహేళన గా మాట్లాడడం పై ఆ సామాజిక వర్గాల పట్ల పూర్తి పారదర్శకంగా ఉన్నామన్నారు. మీరు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు పొన్నం ప్రభాకర్. అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. 2002 లో Sir జరిగినపుడు భారత ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు తొలగవద్దని భావించాం అన్నారు. ఇపుడు బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించాలని Sir తీసుకొచ్చారని ఆరోపించారు.





