మా సంస్థ‌ను ప్ర‌జా ఉద్య‌మంగా మారుస్తాం

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కె. అన్నామ‌లై

చెన్నై : భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఇటీవ‌లే ఆ పార్టీకి రాజీనామా చేసిన కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 50 లక్షల మంది సభ్యత్వ సంఖ్యను సాధించడం , ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చడం మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ఈ ఉద్యమం ఒక గొప్ప మార్పును తీసుకు వస్తుందనే నమ్మకంతోనే సభ్యులు ఇందులో చేరారని చెప్పారు. అమెరికా, లండన్ వంటి ప్రాంతాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సాధించిన 40 నుండి 50 ఏళ్ల వయసు గల తమిళులకు, ఇక్కడ రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించాలో తెలియదని అన్నారు.

రాబోయే నెలల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించడమే మా ఉద్దేశ్యం అని ప్ర‌క‌టించారు. తాము ముందుకు సాగుతున్న కొద్దీ రాష్ట్రంలోని వివిధ సమస్యల గురించి చర్చించేలా మా సంస్థను ఒక ప్రజా ఉద్యమంగా మార్చడమే మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు కె. అన్నామ‌లై. ప్ర‌స్తుతం త‌మ ఫోక‌స్ అంతా రాష్ట్రంలో సుస్థిర‌మైన వ్య‌వ‌స్థ‌ను తీసుకు రావ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. అయితే కొత్త‌గా కొలువు తీరిన విజ‌య్ స‌ర్కార్ పై రాబోయే రోజుల్లో పోరాటం త‌ప్ప‌ద‌న్నారు .

  • Related Posts

    రూ 2 వేల స్కాం పూర్తిగా అబ‌ద్దం : పొన్నం ప్ర‌భాక‌ర్

    Spread the love

    Spread the loveమేం చిల్ల‌ర రాజ‌కీయాలు చేయాల‌ని అనుకోం హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్ స్వామి , చోక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో…

    ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

    Spread the love

    Spread the loveఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు అమెరికా : ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్‌పై కొత్తగా సైనిక చర్యలు తప్పవని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ఇరాన్‌తో ఘర్షణకు ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *