డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు

Spread the love


కీలక సూచ‌న‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కాగిత ర‌హిత పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో అనధికారిక మంత్రివర్గ సమావేశం నిర్వ‌హించారు. డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. పేపర్‌లెస్’ (కాగిత రహిత) పాలన వైపు మళ్లుతున్న తరుణంలో, మంత్రివర్గ సమావేశ అజెండా , పత్రాలను డిజిటల్ విధానంలో చూసుకునేందుకు వీలుగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రత్యేక టాబ్లెట్‌ను అందజేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ,

మంత్రులు కీలక అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, ఇటీవలి రాజకీయ పరిణామాలు, మెట్రో రెండో దశ (Phase-2) అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో పండిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే సేకరించేలా చూడటంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. కాగా, కాగిత రహిత పాలన దిశగా అడుగులు వేస్తూ, ప్రభుత్వం ‘తెలంగాణ డిజిటల్ క్యాబినెట్’ విధానానికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఈ కొత్త విధానాన్ని సమీక్షించగా, మంత్రివర్గ సమావేశ అజెండా, పత్రాలను డిజిటల్ రూపంలో వీక్షించేందుకు వీలుగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మంత్రులకు ప్రత్యేక టాబ్లెట్‌లను పంపిణీ చేశారు.

  • Related Posts

    మాతృ భాషను విస్మరించొద్దు : నారా లోకేష్‌

    Spread the love

    Spread the loveఉపాధ్యాయుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్న విషయాన్ని అధికారులు…

    కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

    Spread the love

    Spread the loveప్రభుత్వ బ‌డిపై నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడు ఎన్.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *