కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

ప్రభుత్వ బ‌డిపై నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్ రెడ్డిని పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో 10వ‌ తరగతిలో చేర్పించారు.క్రిష్ ధరణ్ రెడ్డి విజయవాడలోని పడమట జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం పార్వతీపురంలో పదో తరగతి విద్యను కొనసాగించనున్నారు.

ఒక జిల్లా కలెక్టర్ కుమారుడు తమ పాఠశాలలో చేరడం గర్వ కారణమని, దీనితో తమ బాధ్యత మరింత పెరిగిందని ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ఈ నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంటోంది . ఇదిలా ఉండ‌గా గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (పీఓ)గా పనిచేసిన కూర్మనాథ్ కూడా తన కుమారుడిని ఇదే పాఠశాలలో చదివించడం విశేషం. తాజాగా ఎన్. ప్ర‌భాక‌ర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *