భారత్-యూకే మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు

Spread the love

ఒక చారిత్రాత్మక మైలురాయి

ఫ్రాన్స్ : భార‌త్ , యుకె దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు నెల‌కొన్నాయి. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అత్యంత కీల‌క‌మైన జి-7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఇండియా, యుకె దేశాల అధినేత‌ల మ‌ధ్య కీల‌క ఒప్పందం చోటు చేసుకుంది. భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం 2026 జూలై 15న అమల్లోకి రానుందని తెలియ జేయడానికి సంతోషిస్తున్నట్లు వెల్ల‌డించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఇరు దేశాల మ‌ధ్య కొన్నేళ్లుగా కీలక‌మైన ప్ర‌ధాన అంశాల‌పై సంబంధాలు కొన‌సాగుతూ వ‌స్తున్నాయ‌ని అన్నారు పీఎం.

ఈ ఒప్పందం మన ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు గణనీయంగా ఊపునిస్తుంది అని పేర్కొన్నారు.
ఇది భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు , ఆవిష్కర్తలకు అనేక అవకాశాలను కల్పించి, వికసిత్ భారత్ 2047 సాకారానికి అర్థవంతంగా దోహద పడుతుందని చెప్పారు. జీ7 సదస్సు కోసం ఎవియన్‌లో ఉన్న ప్రధాని స్టార్మర్ , నేను, మన ఆర్థిక సంబంధాలకు లభిస్తున్న ఈ గణనీయమైన ఊపు పట్ల సహజంగానే చాలా సంతోషంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి.

  • Related Posts

    కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

    Spread the love

    Spread the loveప్రభుత్వ బ‌డిపై నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడు ఎన్.…

    నీటి విద్యార్థి కుటుంబాల‌ను ఆదుకోవాలి

    Spread the love

    Spread the loveకాక్రోచ్ జ‌న‌తా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ : కాక్రోచ్ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అభిజిత్ దీప్కే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో చోటు చేసుకున్న ప్ర‌ధాన ప‌రీక్ష‌లైన నీట్ యుజి 2026 తో పాటు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *