న‌టుడు అల్లు అర్జున్ కి కోర్టు స‌మ‌న్లు జారీ

పుష్ప మూవీ రిలీజ్ ఘ‌ట‌న సంద‌ర్భంగా

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన మూవీ పుష్ప చిత్రం విడుద‌ల సంద‌ర్బంగా హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వ‌ద్ద ఉన్న సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తీవ్ర తొక్కిస‌లాట ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు కేసు న‌మోదు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆయ‌న ఒక రోజు చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. దీనిని పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేసుకున్నారు. తాజాగా బ‌న్నీకి కోలుకోలేని షాక్ త‌గిలింది.

శుక్ర‌వారం నాంప‌ల్లి కోర్టు సీరియ‌స్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసు విచారించింది. పుష్ప2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకి సంబంధించి అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని పేర్కొంది. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ ఏ11గా ఉన్నారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు . 2024 డిసెంబర్‌ 4న పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి.

  • Related Posts

    డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ సీరియ‌స్

    ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్‌ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి…

    త‌మిళ‌నాట సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా త్రిష్ కృష్ణ‌న్

    చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఇప్పుడు న‌టి త్రిష కృష్ణ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. త్రిష గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు డీఎంకే ఎమ్మెల్యేల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ త‌రుణంలో కావేరి సమ‌స్య గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు డీఎంకే ప్ర‌తిప‌క్ష నేత ఉద‌య‌నిధి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *