క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

ఐద‌వ రోజుకు చేరిన సీజేపీ నిర‌స‌న

న్యూఢిల్లీ : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో న్యూఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష గురువారం నాటితో 13వ రోజుకు చేరుకుంది. ఈ నిర‌స‌న‌లో నిరాహార‌దీక్ష‌కు కూర్చున్నారు ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారుడు సోన‌మ్ వాంగ్ చుక్. దీంతో ఆయ‌న ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ప్ర‌జాస్వామిక‌వాదులు, జ‌ర్న‌లిస్టులు, సమాజ సేవ‌కులు, జ‌ర్న‌లిస్టులు, త‌దిత‌రులు ఈ సీజేపీ ఉద్య‌మంలో పాలు పంచుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీజేపీ వ్య‌వస్థాక అధ్య‌క్షుడు అభిజీత్ దిప్కే. వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంద‌ని, ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు.

ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సమయంలో ఆయన రక్తంలో చక్కెర స్థాయి 60కి పడిపోగా, రక్తపోటు కూడా తక్కువగానే నమోదైంది. మరోవైపు, పదమూడవ రోజుకు చేరుకున్న ఈ ఆందోళనను మరింత విస్తృతం చేయడంపై నిరసనకారుల నుండి అభిప్రాయాలను సేకరించేందుకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే “చాయ్ పే చర్చా విత్ కాక్రోచెస్” (బొద్దింకలతో టీ-చర్చ) అనే కార్యక్రమాన్ని ప్రకటించారు.

  • Related Posts

    అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    అమ‌రావ‌తి : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున జనసేన బలమైన గొంతు వినిపించాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. అసెంబ్లీ జరిగే ప్రతి నిమిషం విలువైనదేన‌ని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను ప్రజా ప్రతినిధులుగా బాధ్యతగా సభ ముందుకు…

    బీసీఐ చైర్మ‌న్ పై భ‌గ్గుమ‌న్న న్యాయ‌వాదులు

    న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ మానన్ కుమార్ మిశ్రా . నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థుల వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది . బీసీఐ చైర్మ‌న్ రాజీనామా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *