క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

ఐద‌వ రోజుకు చేరిన సీజేపీ నిర‌స‌న

న్యూఢిల్లీ : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో న్యూఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష గురువారం నాటితో 13వ రోజుకు చేరుకుంది. ఈ నిర‌స‌న‌లో నిరాహార‌దీక్ష‌కు కూర్చున్నారు ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారుడు సోన‌మ్ వాంగ్ చుక్. దీంతో ఆయ‌న ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ప్ర‌జాస్వామిక‌వాదులు, జ‌ర్న‌లిస్టులు, సమాజ సేవ‌కులు, జ‌ర్న‌లిస్టులు, త‌దిత‌రులు ఈ సీజేపీ ఉద్య‌మంలో పాలు పంచుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీజేపీ వ్య‌వస్థాక అధ్య‌క్షుడు అభిజీత్ దిప్కే. వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంద‌ని, ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు.

ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సమయంలో ఆయన రక్తంలో చక్కెర స్థాయి 60కి పడిపోగా, రక్తపోటు కూడా తక్కువగానే నమోదైంది. మరోవైపు, పదమూడవ రోజుకు చేరుకున్న ఈ ఆందోళనను మరింత విస్తృతం చేయడంపై నిరసనకారుల నుండి అభిప్రాయాలను సేకరించేందుకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే “చాయ్ పే చర్చా విత్ కాక్రోచెస్” (బొద్దింకలతో టీ-చర్చ) అనే కార్యక్రమాన్ని ప్రకటించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *