జ‌ల‌హార‌తి కార్య‌క్రమంలో పాల్గొన్న సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణవేణి-గోదావరి నదుల సంగమ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు, వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ నీటి పారుద‌ల రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. భారీ ఎత్తున నిధుల‌ను మంజూరు చేశామ‌న్నారు. పాడై పోయిన కాట‌న్ బ్యారేజ్ గేట్ల‌ను పున‌రుద్ద‌రించేందుకు రూ. 110 కోట్లు విడుద‌ల చేశామ‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం చెప్పారు. గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ నీటి పారుద‌ల రంగాన్ని ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. కానీ తాము వ‌చ్చాక జీవం పోస్తున్నామ‌న్నారు.

  • Related Posts

    రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. తాజాగా మేడ్చల్ – మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల గ్రామం, జయప్రద కాలనీలో ప్రజా వినియోగం కోసం కేటాయించిన 4,400 గజాల భూమిని HYDRAA (హైద్రా) రక్షించింది. ఇందులో…

    పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌పై స‌ర్కార్ ఫోక‌స్

    హైద‌రాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వివిధ అంశాలకు సంబంధించిన సవరించిన అంచనాలను పరిశీలించేందుకు, నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర సచివాలయంలో ఒక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *