అద్దంకి ద‌యాక‌ర్, బ‌ల్మూర్ వెంక‌ట్ కు కేబినెట్ హోదా

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం, పార్టీ త‌ర‌పున గ‌ట్టిగా వాయిస్ వినిపిస్తున్న ప్ర‌స్తుతం శాస‌న మండ‌లిలో విప్ లుగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్సీలు అద్దంకి ద‌యాక‌ర్, బ‌ల్మూర్ వెంక‌ట్ ల‌కు తీపి క‌బురు చెప్పింది. వీరికి కేబినెట్ ర్యాంక్ హోదా క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఇద్ద‌రు నేత‌లు పొద్ద‌స్త‌మానం బీఆర్ఎస్ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. దీంతో ప‌దోన్న‌తి క‌ల్పించారంటూ విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది ప‌క్క‌న పెడితే రాష్ట్ర అభివృద్ది పై ఏనాడూ ఫోక‌స్ పెట్ట‌లేద‌న్న విమర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

ఇక తాజాగా అద్దంకి దయాకర్ , డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్‌లకు ‘మంత్రి స్థాయి’ హోదా కల్పించడం ప‌ట్ల సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ మరియు డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్‌లకు ‘మంత్రి స్థాయి’ హోదాను కల్పించారు. వారి పదవీకాలం పూర్తయ్యే వరకు ఈ హోదా అమలులో ఉంటుంద‌ని పేర్కొన్నారు. త‌మ‌పై న‌మ్మ‌కం ఉంచి కేబినెట్ హోదా క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *