చిత్తూరులో స‌మంత రుత్ ప్ర‌భుకు సీమంతం

చిత్తూరు జిల్లా : పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందిన స‌మంత రుత్ ప్ర‌భు సంచ‌ల‌నంగా మారారు. త‌ను ఇప్పుడు గ‌ర్భ‌వ‌తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, ‘మా ఇంటి బంగారం’ సినిమాతో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో, సమంత సీమంతానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆమె తన భర్తతో కలిసి థాయిలాండ్ పర్యటనకు వెళ్లారు, ఆ తర్వాత చిత్తూరులోని తన అత్తగారింటికి వచ్చారు.

అక్కడ ఆమెకు ఒక సాధారణ సీమంతం వేడుక జరిగింది. రాజ్ సోదరి శీతల్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ ఫోటోలను పోస్ట్ చేయడంతో అవి హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స‌మంత రుత్ ప్ర‌భు న‌టించిన మా ఇంటి బంగారం బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. త‌న సినీ కెరీర్ లో ఈ మూవీ అత్యంత ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్పింది ఈ సంద‌ర్బంగా న‌టి స‌మంత రుత్ ప్ర‌భు. అయితే స‌మంత స్వంత ఊరు త‌మిళ‌నాడులోని చెన్నై. త‌న అత్త‌గారి ఇల్లు చిత్తూరు జిల్లా కావ‌డం. త‌న భ‌ర్త ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు. ప‌లు వెబ్ సీరీస్ తీశాడు. ఇందులో న‌టి స‌మంత కూడా న‌టించింది. స‌మంత‌కు ఇది రెండో పెళ్లి. అంత‌కు ముందు త‌ను అక్కినేని నాగ చైత‌న్య‌నను పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత విడి పోయింది.

  • Related Posts

    కోలీవుడ్ లో న‌న్ను ఘోరంగా అవ‌మానించారు : సూరి

    చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టుడు సూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయట పెట్టాడు . నన్ను ఘోరంగా అవమానించి, నా చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారని ఆవేద‌న వ్య‌క్తం…

    అట్లీ రాకా మూవీలో బ‌న్నీ మూడు పాత్ర‌లు..?

    హైద‌రాబాద్ : ఇప్పుడు అంద‌రి క‌ళ్లు అల్లు అర్జున్ రాకాపై ఉన్నాయి. దీనికి స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మూడు పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు టాక్. ‘పుష్ప’ సిరీస్ ఘనవిజయం తర్వాత అగ్రనటుడు అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో రాబోయే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *