చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన చైనా

Spread the love

ఆసియా క‌ప్ హాకీ పైన‌ల్ కు ఇండియా

ఢిల్లీ – భార‌త హాకీ జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. బ‌ల‌మైన జ‌ట్టుగా పేరు పొందిన చైనాను చిత్తు చేసింది. ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు 7 గోల్స్ తేడాతో ఓడించింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు ఒక్క గోల్ కూడా చేసేందుకు ఛాన్స్ ఇవ్వ‌లేదు ఆట‌గాళ్లు. ఆట ఆరంభం నుంచి పూర్త‌య్యేంత వ‌ర‌కు భార‌త్ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చింది. చైనా ఆటగాళ్లు చేసిన ప్ర‌య‌త్నం ఏదీ ఫ‌లించ లేదు. దీంతో భార‌త్ బ‌ల‌మైన జ‌ట్టుగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది ఈ కీల‌క మ్యాచ్ తో. మ‌రో వైపు కొరియా కూడా ఆసియా క‌ప్ హాట్ ఫెవ‌రేట్ గా ఉంది.

భార‌త్, చైనా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన కీల‌క పోరాటంలో మ‌న ఆట‌గాళ్లు సూప‌ర్ షో చేశారు. క‌ళ్లు చెదిరేలా ఆడారు. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తూ మైదానం అంతా క‌లియ తిరిగారు. ఆట‌లో భాగంగా శిలానంద్ ల‌క్రా , దిల్ ప్రీత్ సింగ్ , మ‌న్ దీప్ సింగ్ , రాజ్ కుమార్ పాల్ , సుఖ్ జీత్ సింగ్ చెరో గోల్ సాధించారు. ఈ త‌రుణంలో అద్భుత‌మైన గోల్స్ కొట్టాడు..ప్ర‌త్య‌ర్థల‌కు బిగ్ షాక్ ఇచ్చాడు అభిషేక్ . త‌ను రెండు కీల‌క‌మైన గోల్స్ చేశాడు. దీంతో మొత్తం భార‌త ఆట‌గాళ్లు 7 గోల్స్ చేశారు. చివ‌రి నిమిషం వ‌ర‌కు ప‌ట్టు కోల్పోకుండా ఆట‌ను త‌మ కంట్రోల్ లో ఉంచుకుంది టీమిండియా. దీంతో ఈ మ్యాచ్ గెలుపుతో నేరుగా ఆసియా క‌ప్ హాకీ టోర్నీలో ఫైన‌ల్ కు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా దేశ ప్ర‌ధాన మంత్రి మోదీ జ‌ట్టును అభినందించారు.

  • Related Posts

    శాంస‌న్ ఆడిన ఇన్నింగ్స్ అద్బుతం : అమీర్

    Spread the love

    Spread the loveనిన్న టీం ఇండియాపై షాక్ కామెంట్స్పాకిస్తాన్ : ఎట్టి ప‌రిస్థితుల్లో టీం ఇండియా సెమీ ఫైన‌ల్ కు వెళ్ల‌ద‌ని, వెస్టిండీస్ తో త‌ప్ప‌కుండా ఓడి పోతుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెట‌ర్ మొహ‌మ్మ‌ద్…

    సంజు శాంస‌న్ ద‌మ్మున్న క్రికెట‌ర్ : వ‌సీం అక్రం

    Spread the love

    Spread the loveపాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ పాకిస్తాన్ : పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ , అన‌లిస్ట్ వ‌సీం అక్రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *