ఈవోగా అవ‌కాశం శ్రీ‌వారి పుణ్యం : సింఘాల్

Spread the love

సిఫార‌సుల‌కు నో ఛాన్స్ భ‌క్తుల‌కే ప్ర‌యారిటీ

తిరుమ‌ల : శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువు తీరిన తిరుమ‌ల‌లో ఇవాళ మ‌రోసారి ఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం చెప్ప‌లేనంత ఆనందంగా ఉంద‌న్నారు అనిల్ కుమార్ సింఘాల్. బుధ‌వారం మ‌రోసారి ఆయ‌న కొలువు తీరారు. టీటీడీ ఎక్స్ అఫిసియో మెంబ‌ర్ గా కూడా ప్ర‌మాణం చేశారు. అంత‌కు ముందు అనిల్ కుమార్ సింఘాల్ కాలి న‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు టీటీడీకి ఈవోగా ప‌ని చేస్తూ బ‌దిలీపై వెళుతున్న జె. శ్యామ‌ల రావు, అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవో వీర‌బ్ర‌హ్మంతో పాటు ఆల‌య ప్ర‌ధాన పూజారులు, అర్చ‌కులు . అంత‌కు ముందు అనిల్ కుమార్ సింఘాల స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఇది స్వామి త‌న‌కు ఇచ్చిన గొప్ప అవ‌కాశం అన్నారు. మ‌రోసారి తాను వ‌స్తాన‌ని అనుకోలేద‌న్నారు. కానీ ఆ దేవ దేవుడు త‌న‌ను క‌రుణించాడ‌ని చెప్పారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని చేసిన ఈవో చాలా సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చార‌ని అన్నారు. సాంకేతికత‌ను ఉప‌యోగించుకునేలా చేస్తామ‌న్నారు. ఇదే క్ర‌మంలో భ‌క్తుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తామ‌న్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది తలెత్త‌కుండా త‌న వంతుగా ప‌ని చేస్తాన‌ని, ఎలాంటి పైర‌వీల‌కు , సిఫార‌సుల‌కు తావంటూ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు ఈవో.

  • Related Posts

    శార‌దా పీఠానికే భూములు కేటాయించాలి

    Spread the love

    Spread the loveవెన‌క్కి తగ్గిన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : హైదరాబాద్ కోకాపేట‌లో శార‌దా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జ‌ల మండ‌లికి కేటాయించిన నేప‌థ్యంలో అక్క‌డ…

    టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ ఆల‌యం

    Spread the love

    Spread the loveఆల‌య అధికారుల‌కు అంద‌జేసిన రికార్డులు తిరుపతి : తిరుప‌తి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *