నేపాల్ ప్ర‌ధానిగా కొలువు తీరిన సుశీలా క‌ర్కి

దేశంలోనే తొలిసారిగా మహిళా నాయ‌కురాలు

నేపాల్ : ఎట్ట‌కేల‌కు నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా సుశీలా క‌ర్కి కొలువు తీరారు. ఆమెతో దేశ అధ్య‌క్షుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దేశానికి తొలి మ‌హిళా నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. గ‌తంలో త‌ను దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా చేశారు. సోష‌ల్ మీడియాపై నిషేధం కార‌ణంగా ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఓలి శ‌ర్మ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. దేశం నుంచి దుబాయ్ కి పారి పోయాడు. ఇదిలా ఉండ‌గా దేశ అధ్య‌క్షుడు పార్ల‌మెంట్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈనెల 12 అర్ద‌రాత్రి నుంచి ఇది వ‌ర్తిస్తుంద‌ని, ఈ మేర‌కు తాత్కాలిక పీఎంగా సుశీలా క‌ర్కికి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు దేశ అధ్యక్షుడి కార్యాల‌యం ప్ర‌క‌టించింది.

అంతే కాకుండా వ‌చ్చే ఏడాది 2026 మార్చి 21న ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం ఖాట్మండులోని అధికారిక నివాసంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి దేశానికి చెందిన ప్ర‌ధాన న్యాయమూర్తి, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇదే స‌మ‌యంలో దేశంలో స్వేచ్ఛ‌కు విలువ ఇవ్వాల‌ని, ఆధిప‌త్యం చెల్లుబాటు కాదంటూ పేర్కొన్నారు ఆందోళ‌న‌కారులు. ఇది అరుదైన అవ‌కాశం . ద‌య‌చేసి దేశానికి మీ నాయ‌క‌త్వంలో మంచి పేరు తీసుకు రావాల‌ని కోరారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులతో హోరెత్తించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *