ఆరోగ్య‌శ్రీ‌కి పాత‌ర బీమా కంపెనీల‌కు జాత‌ర

Spread the love

ఏపీ స‌ర్కార్ పై వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఫైర్

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా ఆరోగ్య‌శ్రీ‌కి ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4వేల కోట్ల కేటాయించేందుకు మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచి పెట్టడానికి వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయని ప్ర‌శ్నించారు. ఆరోగ్యశ్రీ కింద 1.60 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే దాని కన్నా.. బీమా కంపెనీలు ఇచ్చేది తక్కువనా ? రూ.2.5 లక్షల లోపు ఆరోగ్య బీమా ఏంటి.. ఆపై ఖర్చును ట్రస్ట్ చెల్లించడం ఏంటి అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో ప్రైవేట్ బీమా అమలు చేసిన 18 రాష్ట్రాల్లో తిరిగి 16 రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకున్నాయని, ఆ విష‌యం గ‌మ‌నించ‌కుండా కూట‌మి స‌ర్కార్ గుడ్డిగా నిర్ణ‌యం తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు.

ప్రైవేట్ బీమా భారం తప్పా లాభం కాదని ఒప్పుకున్నాయ‌ని పేర్కొన్నారు. ట్రస్ట్ విధానంలో ఇంతకాలం నడిచే మన రాష్ట్రంలో ప్రైవేట్ బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటో చంద్రబాబు నాయుడు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వెంటనే ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రైవేట్ కి లింక్ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ట్రస్ట్ విధానంలోనే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని నడపాల‌ని కోరారు. ఆసుపత్రులకు బకాయిలు పడ్డ రూ.2500 కోట్లను తక్షణం చెల్లించాల‌న్నారు. వెంటనే సమ్మెను విరమింప జేయాల‌ని కోరారు. ఉన్నఫలంగా ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేలా చర్యలు చేప‌ట్టాల‌న్నారు. ప్రజారోగ్యంపై చెలగాటలు ఆడొద్దని వార్నింగ్ ఇచ్చారు ష‌ర్మిలా రెడ్డి. రాజకీయాలు ఆపాదించవద్దని, ఆరోగ్య శ్రీ సేవలను విస్తరింప జేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు..?

    Spread the love

    Spread the loveసంకేతాలు ఇచ్చిన ట్ర‌బుల్ షూట‌ర్ షా న్యూఢిల్లీ : కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్డీయే ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ప‌ద‌వులు మార్చే ఛాన్స్ లేక పోలేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా బీజేపీకి చెందిన ట్ర‌బుల్ షూట‌ర్,…

    APAIMS 2.0 వ్యవస్థతో అక్ర‌మాల‌కు చెక్

    Spread the love

    Spread the loveఎరువుల పంపిణీపై ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఎరువు పంపిణీలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేందుకు ఏపీ కూట‌మి స‌ర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *