మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్

Spread the love

అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ : ప‌లువురు ఉన్న‌తాధికారుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌న‌ర్ గా ఉన్న స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ కు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు, గతంలో ఈ బాధ్యతను ఎన్.వి.ఎస్. రెడ్డి నిర్వ‌హించారు.
ప్రభుత్వం అనేక మంది ఐఏఎస్ అధికారులను కీలక విభాగాలు, ఏజెన్సీలకు బదిలీ చేసింది.
సమర్థవంతమైన పాలనను నిర్ధారించే లక్ష్యంతో చేసిన మార్పులలో సవరించిన ఫంక్షనల్ అదనపు ఛార్జ్ (ఎఫ్‌ఏసీ) ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

ఇతర కీలక నియామకాల్లో స్టడీ లీవ్ నుండి తిరిగి వస్తున్న ఐఏఎస్ అధికారిణి శ్రుతి ఓజాను మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ గా ఉన్న‌ కృష్ణ ఆదిత్య కు తెలంగాణ గురుకుల, సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతే కాకుండా కోట శ్రీవత్స ను HMDA జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (జనరల్) గా నియమితులయ్యారు . అథారిటీ కార్యదర్శి కూడా బాధ్యతలు నిర్వర్తిస్తార‌ని జారీ చేసిన ఉత్త‌ర్వులలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పేర్కొన్నారు. మొత్తంగా అటు ఇటు బ‌దిలీలు చేయ‌డం త‌ప్పితే పాల‌న‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

  • Related Posts

    పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం

    Spread the love

    Spread the loveఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న‌ చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పడిపోయిన వృద్ధి రేటును…

    జ‌ల మండ‌లిలో ఈ ఆఫీస్ సేవ‌లు

    Spread the love

    Spread the loveత్వ‌రిత‌గ‌తిన కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ హైద‌రాబాద్ : జ‌ల‌మండ‌లిలో ఇక నుంచి ఈ ఆఫీస్ సేవ‌లు రానున్నాయి. పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు దీనికి శ్రీ‌కారం చుట్టారు జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి. దీని ద్వారా మ‌రింత సౌక‌ర్యాలు అంద‌నున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *