త్వరితగతిన కార్యకలాపాల నిర్వహణ
హైదరాబాద్ : జలమండలిలో ఇక నుంచి ఈ ఆఫీస్ సేవలు రానున్నాయి. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు దీనికి శ్రీకారం చుట్టారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. దీని ద్వారా మరింత సౌకర్యాలు అందనున్నాయి.
ఫైల్ చలనం.. వ్యవస్థ డిజిటలైజేషన్ వల్ల సాంప్రదాయ మాన్యువల్ ఫైల్ చలనం విధానాన్ని పూర్తిగా డిజిటల్ గా నిర్వహిస్తారు. అన్ని ఫైళ్లు ఈ-ఆఫీస్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో సృష్టించబడుతూ, ప్రాసెస్ చేయబడి, పంపబడుతూ, భద్రపరచబడతాయి. దీంతో భౌతిక ఫైళ్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
పేపర్ వినియోగం తగ్గింపు కారణంగా డిజిటల్ డాక్యుమెంటేషన్, ఈ-నోటింగ్ మరియు డిజిటల్ అనుమతుల ద్వారా పేపర్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యం. ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా వ్యయ నియంత్రణకు దోహదపడుతుంది.
వేగవంతమైన అనుమతులు.. నిర్ణయాల వల్ల ఎలక్ట్రానిక్ ఫైల్ రూటింగ్, ఆటోమేటెడ్ వర్క్ఫ్లో ద్వారా ఫైళ్లు ఆలస్యం లేకుండా వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. అధికారులు తమ కార్యాలయ వ్యవస్థల ద్వారా ఫైళ్లను సమీక్షించి, ఆమోదం ఇవ్వగలరు. దీంతో నిర్ణయాల ప్రక్రియ వేగవంతమవుతుంది.
ఫైళ్ల రియల్-టైమ్ ట్రాకింగ్ కారణంగా ప్రతి దశలో ఫైళ్ల స్థితిని రియల్-టైమ్లో పర్యవేక్షించవచ్చు. ఫైల్ ఎక్కడ పెండింగ్లో ఉందో, ఎవరితో ఉందో, ఎంత కాలంగా ఉందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఆలస్యాలు తగ్గుతాయి.
పారదర్శకత, ఆడిట్ సౌలభ్యం వల్ల కొత్త ఫైల్ సృష్టి, నోటింగ్, ఫార్వార్డింగ్, ఆమోదం లేదా మార్పులు వంటి ప్రతి చర్య డిజిటల్ టైమ్స్టాంప్, వినియోగదారుడి వివరాలతో రికార్డు చేయబడుతుంది. ఇది పూర్తి ఆడిట్ ట్రైల్ను నిర్ధారించి బాధ్యతాయుత పరిపాలనకు దోహదం చేస్తుంది.
కార్యాలయ విధానాల ప్రమాణీకరణ ఈ-ఆఫీస్ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని విభాగాల్లో ఒకే విధమైన ప్రమాణిత విధానాలు అమలవుతాయి. ఫైల్ నిర్వహణలో ఏకరీతి విధానం పాటించవచ్చు. ఈ ఆఫీస్ వల్ల కార్యనిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని, ఫైళ్ల ప్రాసెసింగ్ సమయం తగ్గుతుందని,
రికార్డు నిర్వహణ మెరుగు పడుతుందన్నారు ఎండీ. అశోక్ రెడ్డి.






