డీప్యూటీ సీఎంకు నారా లోకేష్ ఆహ్వానం

Spread the love

నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి రండి

అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిద‌ల‌న‌ను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. గత అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయక పోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు 106 కేసులు వేశారని ఈ సంద‌ర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలుపుకుందని పేర్కొన్నారు. దీనివల్ల ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం అయ్యాయని మంత్రి లోకేష్ చెప్పారు.

గతంలో ఏపీలో పాల‌న సాగించిన వైఎస్సార్సీపీ జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసింద‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాము వ‌చ్చాక పూర్తి పార‌ద‌ర్శ‌కంగా నియామ‌కాలు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా, పైర‌వీల‌కు చోటు లేకుండా అత్యంత ప‌క‌డ్బందీగా మెగా డీఎస్సీని నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే 1754 పోస్టుల‌ను భ‌ర్తీ చేశామ‌ని, మెరిట్ నియామ‌క జాబితాను ఖ‌రారు చేశామ‌న్నారు. ఇందులో భాగంగా ఎంపికైన వారికి నియామ‌క ప‌త్రాలు అంద‌జేస్తామ‌న్నారు. అందుకే రావాల‌ని ప‌వ‌న్ ను కోరామ‌న్నారు.

  • Related Posts

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    జూన్ 8వ తేదీ లోపు ప‌నులు పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హైద‌రాబాద్ : వ‌చ్చే జూన్ 8వ తేదీ లోపు ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *