సీఆర్పీఎఫ్ కు ఐకామ్ కార‌కాల్ రైఫిల్స్ స‌ర‌ఫ‌రా

Spread the love

200 CSR-338 రైఫిల్స్ సరఫరా చేయ‌నుంది

హైదరాబాద్ : కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్పీఎఫ్ కు హైదరాబాద్‌ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐకామ్ 200 CSR-338 స్నైపర్ రైఫిల్స్ ను సరఫరా చేయనుంది. ఈ ఏడాది చివరినాటికి సరఫరా పూర్తి కానుంది. ఈ మేరకు సి ఆర్ పి ఎఫ్ – ఐకామ్ – కారకాల్ మధ్య ఒప్పందం కుదిరింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్ ఇంటర్నేషనల్‌‌తో ఐకామ్ సంస్థ సైనిక దళాలకు, భద్రతా సిబ్బందికి అవసరమయ్యే చిన్నపాటి ఆయుధాలను తయారు చేసే సాంకేతికతను పొందేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత్–యూఏఈ రక్షణ భాగస్వామ్యంతో భాగంగా, కారకాల్‌తో కలిసి ఐకామ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఆధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అక్కడే ఈ రైఫిల్స్ ఉత్పత్తి చేసి సి ఆర్ పి ఎఫ్ కు అందజేయనున్నారు. అదనంగా, కారకాల్ ఇక్కడ తయారైన విస్తృత శ్రేణి ఆయుధాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది.

CSR-338 స్నైపర్ రైఫిల్స్ లాపువా మాగ్నమ్ కాలిబర్‌తో, హై-పర్ఫార్మెన్స్ బోల్ట్-యాక్షన్ కలిగి ఉంటాయి. వీటిలో 27 అంగుళాల బ్యారెల్, 10 రౌండ్ల మ్యాగజైన్, ఇరువైపులా ఉపయోగించగలిగే మ్యాగజైన్ రిలీజ్ & సేఫ్టీ మెకానిజం, రెండు దశల అడ్జస్టబుల్ ప్రిసిషన్ ట్రిగ్గర్, నాలుగు స్థాయిలలో సర్దుబాటు చేసుకునే టెలిస్కోప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

  • Related Posts

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం…

    తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    Spread the love

    Spread the loveఅస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో హైద‌రాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *