తాల్ హెల్త్ ఫెస్ట్ కోసం కేటీఆర్ కు ఆహ్వానం

Spread the love

రావాల‌ని కోరిన సీఈవో సాయి గుండ‌వెల్లి

హైద‌రాబాద్ : అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల్సిందిగా ఆ సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌లిసి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా ఆహ్వాన ప‌త్రాన్ని స్వ‌యంగా అంద‌జేశారు సంస్థ సిఇఓ సాయి గుండ‌వెల్లి. ఇదిలా ఉండ‌గా వాస్త‌వానికి ఈనెల 24న బుధ‌వారం న్యూయార్క్ వేదిక‌గా జ‌రిగే గ్రీన్ ఫీల్డ్ అవార్డు అందుకోవాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల హాజ‌రు కాలేక పోయారు. ఈ విష‌యాన్ని మంగళ‌వారం బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కడం విశేషం. తాల్ హాస్పిటల్స్ హెల్త్‌ఫెస్ట్ ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు సీఈవో.

ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ సాయి గుండవెల్లి వెంట ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మం వ‌చ్చే నెల అక్టోబర్ 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (UCSD)లో ఈ ‘హెల్త్‌ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు , మార్పు తీసుకొచ్చే వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వ్యక్తిగత వైద్యం, డిజిటల్ హెల్త్‌కేర్ ఆవిష్కరణలు, సమీకృత వైద్య సంరక్షణ, ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేటీఆర్ కీలకోపన్యాసం ఇవ్వనున్నారు.

తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత పాలన, ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి, ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విధానాలు ప్రపంచ ప్రజలకు ఎంతో విలువైనవిగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరించినందుకు టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    రాష్ట్రాభివృద్దికి సింగ‌పూర్ సాంకేతిక సాయం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు సింగ‌పూర్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్దికి సింగ‌పూర్ దేశం అనుస‌రిస్తున్న సాంకేతిక విజ్ఞానం ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నామ‌న్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, మత్స్య శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. మంత్రి పొంగూరు నారాయ‌ణ‌తో…

    వైసీపీ మనుగడ మొత్తం విధ్వంస‌మే

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి పార్థ‌సార‌థి అమ‌రావ‌తి : వైసీపీ పాల‌నా కాలంలో మొత్తం విధ్వంసం త‌ప్ప జ‌రిగింది ఏముంద‌ని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. నాడు వివేకా నేడు దస్తగిరి వైసీపీ ‘రక్త చరిత్ర’ కాదా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *