ఐసీసీసీతో అన్ని ఆల‌యాల‌ను అనుసంధానం చేయాలి

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల‌లో గురువారం నూత‌నంగా నిర్మించిన ఏపీసీ 5 భ‌వ‌నాన్ని ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సిస్ట‌మ్ ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది భ‌క్తులు వ‌చ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల‌లో గోవింద నామం త‌ప్పా ఇత‌రవేవీ వినిపించ కూడ‌ద‌న్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత ప‌విత్ర‌మైన క్షేత్ర‌మ‌ని , శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కృప వ‌ల్ల‌నే ఇవాళ తాను బ‌తికి బ‌య‌ట ప‌డ్డాన‌ని చెప్పారు. ఆయ‌న చ‌ల‌వ వ‌ల్ల‌నే ముఖ్య‌మంత్రి మరోసారి కొలువు తీరాన‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ప‌ష్టం చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హెఆర్డీ అండ్ ఐటీ మంత్రి నారా లోకేష్, రెవిన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో వి. వీరబ్రహ్మం, సివీఎస్వో మురళీకృష్ణ, టిటిడి బోర్డు సభ్యులు, సీఈ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *