విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను ఆదుకోవాలి : పీవీఎన్ మాధ‌వ్

Spread the love

ఏపీ స‌ర్కార్ కు విన్న‌వించిన ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు

అమరావ‌తి : ఆరుగాలం శ్ర‌మించే విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను ఆదుకోవాల‌ని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.
రాష్ట్ర రాజ‌ధానిలో విశ్వ క‌ర్మ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నిర్మించే వాణిజ్య సముదాయాల్లో కార్పెంటర్స్, స్వర్ణ కారుల కోసం ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్లు 50 ఏండ్ల నిండిన వారికి, విశ్వబ్రాహ్మణ వృత్తుల వారికి అందించాలని అన్నారు . ఐదు వృత్తుల వారి కోసం ప్రత్యేక పారిశ్రామిక విధానం అమ‌లు చేయాల‌న్నారు. వారికి వారికి ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని అన్నారు. విశ్వకర్మ జయంతిని శ్రామికుల దినోత్సవం గా జరుపు కోవాల‌ని, అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలన్నారు. యజ్ఞాలు చేయించాలని సూచించారు.

ఆలయాల్లో ఐదు వృత్తులకు సంబంధించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అంతే కాకుండా స్థపతులను నియమించాలని డిమాండ్ చేశారు మాధ‌వ్. ఏదైనా ఒక నైపుణ్య కోర్సులు కలిగిన యూనివర్సిటీ కి విశ్వకర్మ పేరు పెట్టాలని అన్నారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ కు భారీగా నిధులు మంజూరు చేయాల‌ని సీఎంను కోరారు. కార్పొరేషన్ ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేసి అమ్మకాలు నిర్వహించాలని అన్నారు. తద్వారా ఆదాయం చేకూర్చి విశ్వ బ్రాహ్మణుల్లో వృత్తి పరమైన ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న కుటుంబాలను ఆత్మహత్యల వైపు వెళ్లకుండా వడ్డీ లేని రుణాలతో ఆదుకోవాల‌ని కోరారు. సంచార జాతుల కుల ధృవీకరణ / కుల గుర్తింపు కోసం జిల్లా ఏజెన్సీ ఏర్పాటు చేయాలని మాధవ్ ముఖ్యమంత్రికి విన్న‌వించారు.

  • Related Posts

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం…

    తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    Spread the love

    Spread the loveఅస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో హైద‌రాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *