ప్ర‌తి సంవ‌త్స‌రం డీఎస్సీ నిర్వ‌హిస్తాం

Spread the love

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీలో ఇక నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం కూట‌మి స‌ర్కార్ మెగా డీఎస్సీ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాము కూడా ఏటా ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీ అంటేనే టీడీపీ అని, టీడీపీ అంటేనే డీఎస్సీ అని వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ జగన్ నిరుద్యోగ యువతను అయిదేళ్ల పాటు దగా చేశారని మండిపడ్డారు. బుధ‌వ‌వారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల మెగా డీఎస్సీలో పెనుకొండ నియోజక వర్గం నుంచి టీచర్ పోస్టులు సాధించిన 70 మంది అభ్యర్థులకు మంత్రి సవిత ఘ‌నంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

2025 మెగా డీఎస్సీలో టీచర్ పోస్టులు సాధించిన 15,941 మంది అభ్యర్థులకు ఇటీవల సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పుడు తన తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ పై పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కేవలం 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన ఘనత మంత్రి నారా లోకేష్ దేనన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకోడానికి వైసీపీ నాయకులు 105కు పైగా కోర్టుల్లో కేసులు వేశారన్నారని ఆరోపించారు. వాటన్నింటినీ అధిగమించి డీఎస్పీ నిర్వహించిన ఘనత లోకేశ్ దేన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో 15 ఏళ్లలో 14 సార్లు డీఎస్సీని నిర్వహించి, 1,96,619 టీచర్ ఉద్యోగాలిచ్చారన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ కోసం బీసీ అభ్యర్థులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఆరు వేల మందికి ఉచిత శిక్షణ అంద జేశామన్నారు. వారిలో 270 మంది టీచర్ ఉద్యోగాలు సాధించడంపై మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు.

  • Related Posts

    అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట చేసిన పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు , టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డీఎంకే స‌ర్కార్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఆయ‌న సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టికే త‌న‌ను…

    ఇక నుంచి నిరంత‌రాయంగా జాబ్స్ భ‌ర్తీ

    Spread the love

    Spread the loveచేస్తామ‌ని ప్ర‌క‌టించిన ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు భావించారని అన్నారు. అయితే 2014 నుంచి 2024…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *