మద్యం అమ్మ‌కాల్లో తెలంగాణ రికార్డ్

Spread the love

నెల రోజుల్లోనే రూ. 2,715 కోట్ల అమ్మ‌కాలు

హైద‌రాబాద్ : అభివృద్ధిలో వెనుకంజ‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రం మ‌ద్యం అమ్మ‌కాల్లో, మ‌హిళ‌ల‌పై నేరాల న‌మోద‌లో మాత్రం టాప్ లో కొన‌సాగుతోంది. ద‌స‌రా పండుగ ఈసారి అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి రోజున వ‌చ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్కార్ అన్ని మ‌ద్యం దుకాణాలు, బార్లు, మాంసం, చికెన్, చేప‌ల దుకాణాల‌ను మూసి వేయాల‌ని ఆదేశించింది. దీంతో మ‌ద్యం బాబులు దెబ్బ‌కు ముంద‌స్తుగానే మ‌ద్యం బాటిళ్ల‌ను కొనుగోలు చేశారు. ముందు జాగ్ర‌త్త‌గా మ‌రికొంద‌రు మద్యం ప్రియులు ఏకంగా ఒక నెల రోజు ముందుగానే భారీ ఎత్తున త‌మ వ‌ద్ద ఉంచుకున్నారు. ఇక కేవ‌లం ఈ నాలుగు రోజుల‌లో ఈ అమ్మ‌కాలు రికార్డు స్థాయిని దాటాయి. ఏకంగా రూ. 1000 కోట్ల విలువైన మ‌ద్యం స్టాక్ ఆయా మ‌ద్యం ఔట్ లెట్ల నుంచి అమ్ముడు పోయాయి.

సెప్టెంబర్ 28న రూ.260 కోట్లు అమ్మ‌కాలు జ‌రుగా, 29న రూ.279 కోట్లు, 30న రూ.301 కోట్లు , అక్టోబర్ 1న రూ.320 కోట్ల విలువైన మద్యం నిల్వలను సేకరించాయి. సెప్టెంబర్ 1 నుండి 29 వరకు, మద్యం అమ్మకాలు ఇప్పటికే రూ.2,715 కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీలలో కలిపి, కేవలం రెండు రోజుల్లో అమ్మకాలు రూ.620 కోట్లకు పెరిగాయి, ఇది దసరాకు ముందు డిమాండ్ పెరుగుదలను సూచిస్తుంది. ఈ సంవత్సరం పండుగ కాలంలో మద్యం అమ్మకాలు గత సంవత్సరం గణాంకాలను మించి పోయాయని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. 2023 సంవత్సరంలో తొమ్మిది రోజుల ఉత్సవాలలో, మద్యం అమ్మకాలు రూ.1,057 కోట్లుగా ఉన్నాయి, కానీ ఈ సంవత్సరం పండుగకు కేవలం నాలుగు రోజుల్లోనే రూ.1,000 కోట్ల మార్కును దాటాయి.

2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుండి, మద్యం అమ్మకాలు స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. 2014-15లో అమ్మకాలు రూ. 10,000 కోట్లుగా ఉండగా, క్రమంగా పెరిగి 2024-25 నాటికి రూ. 34,600 కోట్లకు చేరుకున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ. 35,145 కోట్లుగా నమోదయ్యాయి.

  • Related Posts

    పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం

    Spread the love

    Spread the loveఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న‌ చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పడిపోయిన వృద్ధి రేటును…

    జ‌ల మండ‌లిలో ఈ ఆఫీస్ సేవ‌లు

    Spread the love

    Spread the loveత్వ‌రిత‌గ‌తిన కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ హైద‌రాబాద్ : జ‌ల‌మండ‌లిలో ఇక నుంచి ఈ ఆఫీస్ సేవ‌లు రానున్నాయి. పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు దీనికి శ్రీ‌కారం చుట్టారు జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి. దీని ద్వారా మ‌రింత సౌక‌ర్యాలు అంద‌నున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *