భార‌త్, చైనా మ‌ధ్య ఫ్లైట్ స‌ర్వీసులు షురూ

Spread the love

తొల‌గిన ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌లు

ఢిల్లీ : ఏడు సంవ‌త్స‌రాల సుదీర్ఘ కాలం త‌ర్వాత భార‌త , చైనా దేశాల మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితులు సాధార‌ణ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవ‌లే దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చైనా విదేశాంగ శాఖ మంత్రి పిలుపు మేర‌కు చైనా దేశంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఇరు దేశాల మ‌ధ్య వ్యాపార‌, వాణిజ్య‌, లాజిస్టిక్, టెక్నాల‌జీ ప‌రంగా స‌త్ సంబంధాలు పెంపొందించు కోవాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు ఇరు దేశాధినేత‌లు ఒక ఒప్పందానికి వ‌చ్చాయి. ఈ త‌రుణంలో ఇరు దేశాల మ‌ధ్య గ‌తంలో విమాన స‌ర్వీసులు నిలిచ పోయాయి. ఈనెల‌లో ప్ర‌త్య‌క్ష విమాన స‌ర్వీసులు పునః ప్రారంభించ‌నున్నాయి. కోవిడ్ కారణంగా 2020 నుండి విమాన సర్వీసులు నిలిచి పోయాయి.

సాంకేతిక స్థాయి చర్చల తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు పునః ప్రారంభించ బోతున్నాయి మహమ్మారి మరియు లడఖ్ ప్రతిష్టంభన సమయంలో నిలిపి వేయబడిన నాలుగు సంవత్సరాల తర్వాత, భారతదేశం, చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు ఈ నెలాఖరులోగా పునః ప్రారంభించ బడతాయని ఎంఈఏ ప్రకటించింది. ఈ విష‌యాన్ని భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ గురువారం ప్ర‌క‌టించింది. తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం దృష్ట్యా ఇది పునరుద్ధరించ బడలేదు. భారతదేశం, చైనాలోని నిర్దేశిత పాయింట్లను అనుసంధానించే ప్రత్యక్ష విమాన సర్వీసులు అక్టోబర్ చివరి నాటికి తిరిగి ప్రారంభించవచ్చని పేర్కొంది. విమాన సర్వీసుల ఒప్పందంపై సాంకేతిక స్థాయి చర్చలలో నిమగ్నమై ఉన్నారని తెలిపింది.

  • Related Posts

    పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం

    Spread the love

    Spread the loveఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న‌ చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పడిపోయిన వృద్ధి రేటును…

    జ‌ల మండ‌లిలో ఈ ఆఫీస్ సేవ‌లు

    Spread the love

    Spread the loveత్వ‌రిత‌గ‌తిన కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ హైద‌రాబాద్ : జ‌ల‌మండ‌లిలో ఇక నుంచి ఈ ఆఫీస్ సేవ‌లు రానున్నాయి. పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు దీనికి శ్రీ‌కారం చుట్టారు జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి. దీని ద్వారా మ‌రింత సౌక‌ర్యాలు అంద‌నున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *