newsseals.com
News

ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపాల్సిందే

VijayaBhaskar October 4, 2025
newsseals-trump
Spread the love

స్ప‌ష్టం చేసిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్

అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హమాస్ శాంతికి సిద్ధంగా ఉందన్నారు. ఇక ఇజ్రాయెల్ త‌క్ష‌ణ‌మే గాజాపై బాంబు దాడులు ఆపాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు . హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు ట్రంప్. అంతే కాకుండా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ తన కాల్పుల విరమణ ప్రణాళిక కింద బందీలను విడిపించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దీంతో గాజాపై బాంబు దాడులను ఆపమని ఇజ్రాయెల్‌కు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టం చేశారు. జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ప్రకటన మొదటిసారిగా అమెరికా కీలక మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌ను ఇలా కోర‌డం.

తన బాంబు దాడులను ఆపమని ఆయన స్పష్టంగా కోరారు. ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలి, తద్వారా మనం బందీలను సురక్షితంగా , త్వరగా బయటకు తీసుకు వ‌చ్చేందుకు వీలు కుదురుతుంద‌న్నారు . ఈ విష‌యాన్ని ట్రంప్ త‌న అధికారిక ట్రూత్ సోష‌ల్ ద్వారా పేర్కొన్నారు.
ప్రస్తుతం, అలా చేయడం చాలా ప్రమాదకరం. పరిష్కరించాల్సిన వివరాలపై తాము ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని అన్నారు అమెరికా చీఫ్‌. ఇది గాజా గురించి మాత్రమే కాదు, ఇది మధ్యప్రాచ్యంలో చాలా కాలంగా కోరుకునే శాంతి గురించ అని పేర్కొన్నారు. ఖతార్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ , జోర్డాన్‌లతో సహా US మిత్రదేశాలకు మధ్యవర్తిత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ట్రంప్.