
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమల ఆలయ పరిధిలోని ఆలయాలలో అక్టోబర్ నెలలో నిర్వహించే ఉత్సవాల వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 10, 17, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 7న పౌర్ణమి గరుడ సేవ ఉంటుంది. అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
అంతే కాకుండా అక్టోబర్ 15 నుండి 24వ తేదీ వరకు శ్రీ తిరుమల నంబి ఉత్సవం, శాత్తుమొరై ఉంటుంది.
16న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. 18 నుండి 27వ తేదీ వరకు శ్రీ మానవుల మహాముని ఉత్సవం ఉంటుంది. 19న నరక చతుర్దశి, ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజ స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు . 20న దీపావళి ఆస్థానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.