డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

Spread the love

తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌

హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్లకు వివరించారు. మొదటి దశ – హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ – మే 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయని వెల్ల‌డించారు.

సెన్సస్ 2027 భారతదేశంలో మొట్ట మొదటి పూర్తి డిజిటల్ సెన్సస్, ఇది రియల్-టైమ్, ఖచ్చితమైన , పారదర్శక డేటా సంగ్రహణను నిర్ధారించే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించ బడుతుందని అన్నారు సీఎస్ రామ‌కృష్ణ రావు. HLO కి 15 రోజుల ముందు స్వీయ-గణన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

మారుమూల, గిరిజన , దుర్బల ప్రాంతాలతో సహా – పూర్తి కవరేజీని నిర్ధారించాలని, గణనదారులు , పర్యవేక్షకులకు నిర్మాణాత్మక శిక్షణపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రధాన కార్యదర్శులు రాహుల్ బొజ్జా, సందీప్ కుమార్ సుల్తానియా, ప్రియాంక, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

  • Related Posts

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం స‌మీక్ష

    Spread the love

    Spread the loveకీల‌క సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ‌హించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చ‌ర్చించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *