భోగాపురం ఎయిర్ పోర్టు పురోగ‌తిపై స‌మీక్ష‌

Spread the love

కీల‌క సూచ‌న‌లు చేసిన రామ్మోహ‌న్ నాయుడు

అమ‌రావ‌తి : కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయ‌న విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పురోగతిపై స్టేక్‌హోల్డర్ల సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, AAI, BCAS, DGCA , రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రాజెక్టుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. సమయానికి పూర్తి చేసేలా ఆపరేటర్లతో చర్చించారు. ఎయిర్‌లైన్ భాగస్వాములు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైమానిక అనుసంధానం గణనీయంగా మెరుగు పడుతుందని అభిప్రాయం వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక కొత్త‌గా దేశంలో ప‌లు ప్రాంతాల‌ను ఎంపిక చేసి , నూత‌న ఎయిర్ పోర్టుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి.

  • Related Posts

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం స‌మీక్ష

    Spread the love

    Spread the loveకీల‌క సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ‌హించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చ‌ర్చించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *