భోగాపురం ఎయిర్ పోర్టు పురోగ‌తిపై స‌మీక్ష‌

కీల‌క సూచ‌న‌లు చేసిన రామ్మోహ‌న్ నాయుడు

అమ‌రావ‌తి : కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయ‌న విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పురోగతిపై స్టేక్‌హోల్డర్ల సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, AAI, BCAS, DGCA , రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రాజెక్టుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. సమయానికి పూర్తి చేసేలా ఆపరేటర్లతో చర్చించారు. ఎయిర్‌లైన్ భాగస్వాములు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైమానిక అనుసంధానం గణనీయంగా మెరుగు పడుతుందని అభిప్రాయం వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక కొత్త‌గా దేశంలో ప‌లు ప్రాంతాల‌ను ఎంపిక చేసి , నూత‌న ఎయిర్ పోర్టుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *