గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌ను మ‌ళ్లీ నిర్వ‌హించాలి : క‌విత

Spread the love

కాంగ్రెస్ స‌ర్కార్ పై ఎమ్మెల్సీ సీరియ‌స్ కామెంట్స్

హైద‌రాబాద్ : గ్రూప్ -1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని, తిరిగి నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి సెంట్ర‌ల్ లైబ్ర‌రీ వ‌ద్ద గ్రూప్ -1 ప‌రీక్ష బాధితుల‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. ఆమెను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. వారికి మ‌ద్ద‌తుగా రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల‌తో వాగ్వావాదానికి దిగారు. ఈ సంద‌ర్బంగా క‌విత మీడియాతో మాట్లాడారు.
విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నామ‌ని అన్నారు. గ్రూప్ -1 లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని ఆరోపించారు. ఎందుకు విచార‌ణ చేప‌ట్టేందుకు ముందుకు రావ‌డం లేదంటూ కాంగ్రెస్ స‌ర్కార్ ను.

ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్ మెంట్లు చేసి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ ప్ర‌శ్నించారు. మా పేపర్లను ఇస్తామంటూ ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడని, ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఎందుకు ముందుకు రావ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. ర్యాంకర్ల పేపర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతోంద‌ని నిల‌దీశారు క‌విత‌. అర్హత లేని వారికి ఉద్యోగాలు రావద్దనే తాము కోరుతున్నామ‌ని అన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కి నాన్ లోకల్స్ 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో తిరుగుతూ తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించు కోవటం లేదన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడకు రావాల‌ని, లేదంటే తాము బీహార్ కు వెళతామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *