మాగంటి సునీతకు బి ఫామ్ ఇచ్చిన కేసీఆర్

Spread the love

రూ. 40 ల‌క్ష‌ల చెక్కు కూడా ఇచ్చిన బాస్

హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్న మాగంటి సునీతా గోపీనాథ్ కు బి – ఫామ్ అంద‌జేశారు. దీంతో పాటు ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం బీఆర్ఎస్ త‌ర‌పున రూ. 40 ల‌క్ష‌ల చెక్కును కూడా స్వ‌యంగా ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా ఆమెను దీవించారు. త‌నకు బి ఫామ్ ఇస్తున్న స‌మ‌యంలో మాగంటి సునీత త‌న భ‌ర్త మాగంటి ర‌వీంద్ర‌నాథ్ ను త‌లుచుకుని భావోద్వేగానికి లోన‌య్యారు. ఇటీవ‌లే ఆయ‌న అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఏరికోరి త‌న‌నే ఎంపిక చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప‌లు క్రిమిన‌ల్ కేసులు ఉన్న న‌వీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది.

మ‌రో వైపు ప్ర‌చారం ఊపందుకుంది. ప్ర‌ధానంగా బీఆర్ఎస్ వ‌ర్సెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పోరు కొన‌సాగుతోంది. ఇదిలా ఉండ‌గా మాగంటి సునీత‌ను ఎలాగైనా గెలిపించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, హ‌రీశ్ రావులతో పాటు , బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఇప్ప‌టికే దొంగ ఓట్ల న‌మోదుపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ .

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *