newsseals.com

మ‌రాఠాలో 96 లక్ష‌ల న‌కిలీ ఓట‌ర్లు

October 19, 2025 · VijayaBhaskar

రాజ్ థాక‌రే సంచ‌ల‌న కామెంట్స్

ముంబై : మహారాష్ట్రలో 96 లక్షల మంది ‘నకిలీ’ ఓటర్లు ఉన్నారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ అధ్య‌క్షుడు రాజ్ థాకరే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇవాళ జ‌రిగిన బూత్-స్థాయి ఏజెంట్లను ఉద్దేశించి థాకరే మాట్లాడారు అంత‌కు ముందు.ఓటర్ల జాబితాలో రిగ్గింగ్ ద్వారా ఎన్నికలు జరిగితే అది ఓటర్లకు చేసే అతిపెద్ద అవమానమని అన్నారు. నకిలీ ఓటర్లను కనుగొనడానికి ఓటర్ల జాబితాను ధృవీకరించాలని ఆయన తన పార్టీ కార్యకర్తలను కోరారు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అద‌నంగా న‌కిలీ ఓట‌ర్ల‌ను చేర్చార‌ని ఆరోపించారు. న‌కిలీ ఓట‌ర్ల‌ను గుర్తించ‌కుండా, తొల‌గించ‌కుండా ఎన్నిక‌ల‌ను ఎలా నిర్వ‌హిస్తారంటూ ప్ర‌శ్నించారు.

ఓటర్ల జాబితాలో రిగ్గింగ్ ద్వారా ఎన్నికలు జరిగితే, అది ఓటర్లకు చేసే అతిపెద్ద అవమానమని అన్నారు. నకిలీ ఓటర్లను గుర్తించడానికి ఓటర్ల జాబితాను ధృవీకరించాలని ఆయన తన పార్టీ కార్యకర్తలను కోరారు. శివసేన (యుబిటి), కాంగ్రెస్, ఎన్‌సిపి (ఎస్‌పి) , ఎంఎన్‌ఎస్ సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ , ప్రధాన ఎన్నికల అధికారిని కలిశాయి, వివిధ చిరునామాలు, అసెంబ్లీ విభాగాలలో ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు ఉన్నాయని పేర్కొంటూ ఆధారాలు కూడా స‌మ‌ర్పించాయి. జనవరి 31, 2026 నాటికి పూర్తి కానున్న గ్రామీణ , పట్టణ సంస్థల ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో “సరిదిద్దడం” మరియు “అసాధారణతలను” తొలగించాలని ప్రతిపక్షం పిలుపునిచ్చింది.

Related News