నేనెప్పుడూ గుండాయిజం చేయ‌లేదు

మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి కామెంట్స్

వ‌రంగ‌ల్ జిల్లా : మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎప్పుడూ , ఎన్న‌డూ గూండాయిజం చేయ‌లేద‌న్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌బ్జాల‌కు పాల్ప‌డ‌లేద‌ని, బెదిరించ లేద‌ని, వ‌సూళ్ల‌కు పాల్ప‌డ లేద‌ని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ రెడ్డి కథ సుఖాంతం అయ్యిందని అన్నారు. తాను ఏనాడూ చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ లేద‌న్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారంది. కాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేశాడా లేక కొండా సురేఖ‌, కొండా ముర‌ళిని ఉద్దేశించి చేశాడా అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల ఉమ్మ‌డి ఓరుగ‌ల్లు జిల్లాలో చోటు చేసుకుంది దెక్క‌న్ సిమెంట్స్ వ్య‌వ‌హారం.

ఈ ఘ‌ట‌న‌లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా ప‌టేల్. ఆమె ఏకంగా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని, ఆయ‌న సోద‌రులు కొండ‌ల్ రెడ్డి, తిరుప‌తి రెడ్డిల గురించి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. వారికి ఎలాంటి ప‌ద‌వులు లేకుండానే ఎలా గ‌న్ మెన్ల‌ను ఇచ్చారంటూ నిల‌దీశారు. ఒక కేబినెట్ మంత్రిగా ఉన్న త‌న త‌ల్లి ఇంటికి పోలీసులు, మ‌ఫ్టీలో ఉన్న వారు ఎలా వ‌స్తారంటూ ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలివాన‌గా మారింది. ఈ త‌రుణంలో ఓరుగ‌ల్లు జిల్లాకు చెందిన నేత‌లు ఇలా మూకుమ్మ‌డిగా ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *