మెంథా తుపాను ఎఫెక్ట్ ప‌లు జిల్లాల‌కు సెల‌వులు

Spread the love

విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

అమ‌రావ‌తి : మెంథా తుఫాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయనీ.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఒకటి నుండి ఐదు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సెలవులలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.కృష్ణా జిల్లాలో 27, 28, 29 వ తేదీల‌లో మూడు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 27, 28వ తేదీల‌లో రెండు రోజులు సెల‌వు ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో 27, 28వ తేదీల‌లో రెండు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు. క‌డ‌ప జిల్లాలో 27, 28వ తేదీల‌లో రెండు రోజుల పాటు సెల‌వులు ఇచ్చారు.

బాపట్ల జిల్లాలో 27, 28, 29వ తేదీల‌లో మూడు రోజుల పాటు సెల‌వులు ఇస్తున్న‌ట్లు తెలిపారు. గుంటూరు జిల్లా 27, 28, 29 మూడు రోజులు ఇవ్వ‌గా అనకాపల్లి జిల్లాలో 27,28,29 వ తేదీల‌లో మూడు రోజులు సెల‌వులు ఇచ్చారు. కాకినాడ జిల్లాలో 27, 28, 29, 30, 31వ తేదీల‌లో ఐదు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఏలూరు జిల్లాలో 27, 28వ తేదీల‌లో రెండు రోజులు సెల‌వులు ఇచ్చారు. పల్నాడు జిల్లాలో 27న ఒక్క రోజు సెల‌వు ప్ర‌క‌టించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 28, 29 వ తేదీల‌లో రెండు రోజుల పాటు సెల‌వులు ఇచ్చారు.

  • Related Posts

    రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

    Spread the love

    Spread the loveభ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి అమ‌రావ‌తి : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హోం…

    రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *