రైతు క‌ష్టం త‌మ కోసం కాదు లోకం కోసం

Spread the love

మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు

హైద‌రాబాద్ : మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశానికి వ్య‌వ‌సాయ రంగ పితామ‌హుడిగా పేరు పొందిన స్వామి నాథ‌న్ ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని కోరారు. రైతు నేస్తం, ముప్ప‌వ‌ర‌పు ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో సంయుక్తంగా ఈ రంగంలో విశేషంగా కృషి చేసిన ప‌లువురికి స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్బంగా వెంక‌య్య నాయుడు ప్ర‌సంగించారు. రైతు కష్టం వారి కోసం కాదు, లోకం కోసం అన్నారు. అయితే వారికి సంఘటిత శక్తి, లాబీయింగ్ వంటివి లేనే లేవ‌న్నారు. అందుకే పట్టణాలకు, పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత గ్రామాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అందించాలని పిలుపునిచ్చారు. రైతులను చైతన్యవంతం చేసే బాధ్యతను ప్రభుత్వాలు స్వీకరించాలని కోరారు. ఇందు కోసం విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఆహారం అయితే లభిస్తోంది కానీ పోషకాహార లోపం (Hidden Hunger) లేకుండా చూడాలన్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ స్ఫూర్తిని మార్గదర్శకంగా తీసుకోవాలని కోరారు వెంక‌య్య నాయుడు. పర్యావరణానికి దన్నుగా నిలిస్తూ దండిగా పోషకాలు అందించే రాగి, సజ్జ, జొన్న, ఆరిక, కొఱ్ఱ వంటి సిరిధాన్యాల ఉత్పత్తి దిశగా ప్రభుత్వాలు రైతులకు ప్రోత్సాహం అందించాల‌ని కోరారు. ఈ విషయంలో ప్రత్యేకించి యువతరాన్ని చైతన్యవంతం చేయాల‌ని అన్నారు. ప్రభుత్వాలు, ప్రచార సాధనాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాల‌ని కోరారు వెంక‌య్య నాయుడు. రైతులు పూర్తిగా వ్యవసాయం మీదనే కాకుండా, అనుబంధ రంగాల మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. అనుబంధ రంగం అంటే వ్యవసాయానికి నిజమైన సాయం. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల వారు తమ తమ కోణాల్లో రైతు సమస్యలను గుర్తించడం అన్నారు.

  • Related Posts

    రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

    Spread the love

    Spread the loveభ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి అమ‌రావ‌తి : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హోం…

    రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *