జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై స‌ర్కార్ ఫోక‌స్

స‌మీక్ష స‌మావేశంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్

అమ‌రావ‌తి : ఏపీలో మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది క‌థ‌. ఓ వైపు మొంథా తుపాను. ఇంకో వైపు జిల్లాల పున‌ర్ విభ‌జ‌న కార్య‌క్ర‌మంపై సుదీర్ఘ స‌మీక్ష‌. సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం ఉప‌సంఘం భేటీ అయ్యింది. ఈ మేర‌కు తాము సేక‌రించిన సూచ‌న‌లు, స‌లహాల‌ను నివేదిక రూపంలో అందించారు సీఎంకు. ఈ కార్య‌క్ర‌మంలో హైలెట్ గా నిలిచారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న సీఎంతో పాటు త‌ను కూడా స‌మీక్ష‌లు చేప‌ట్టారు. వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌ధానంగా ఇందులో జిల్లాల పునర్విభజనపై వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై సమీక్ష జ‌రిగింది. ఈ సమావేశంలో ఉప సంఘం కన్వీనర్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ , మంత్రులు నాదెండ్ల మనోహర్, పి. నారాయణ గారు, నిమ్మల రామానాయుడు, శ్రీమతి వంగలపూడి అనిత పాల్గొన్నారు.

కాగా తుపాను కార‌ణంగా వర్చువల్ విధానంలో మంత్రులు బి.సి. జనార్దనరెడ్డి, సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీని గురించి ప్ర‌స్తావించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో జిల్లాల పున‌ర్ విభ‌జ‌న జ‌రిగింద‌ని, పూర్తిగా అశాస్త్రీయంగా చేశారంటూ మండిప‌డ్డారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌స్తుతం మొంథా తుపాను ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని, తుపాను తీవ్ర‌త త‌గ్గాక తిరిగి మ‌రోసారి కీల‌క భేటీ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *